భూమి కంపించినా బెదరని ప్రధాని!
న్యూజిలాండ్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆ దేశ ప్రధాని జెసిండా అర్డెర్న్ మాత్రం తనదైన శైలిలో కార్యక్రమాన్ని కొనసాగించారు......
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రధాని జెసిండా అర్డెర్న్ మాత్రం తనదైన శైలిలో కార్యక్రమాన్ని కొనసాగించారు. తానున్న భవనం కుదుపులకు లోనవుతున్నా.. పెద్దగా ఆందోళనకు గురికాలేదు. అయితే.. ఆమె ధీమాకు కారణం లేకపోలేదు లెండి! పార్లమెంటు కాంప్లెక్సులో ఉండే ఆ భవనం భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించారు. ఏదేమైనా భూమి కంపిస్తున్న సమయంలో అంత తేలిగ్గా తీసుకోవడం ఆమెకే చెల్లింది. భూమి కంపించిన సమయంలో వ్యాఖ్యాతకు, ఆమెకు మధ్య సంభాషణ ఇలా సాగింది...
‘‘ర్యాన్(వ్యాఖ్యాత).. ఇక్కడ భూమి కంపిస్తోంది. చుట్టూ వస్తువులు కదులుతున్నాయి చూశావా..?’’ గదిలో ఇటుఅటూ చూస్తూ అన్నారు జెసిండా. అనంతరం కొద్దిసేపట్లో ‘‘ఇక ఆగిపోయింది. సురక్షితంగా ఉన్నాం. నాపై ఎలాంటి వేలాడుతున్న విద్యుత్తు దీపాలు లేవు. నేను ఉన్న నిర్మాణం చాలా బలమైందనుకుంటా’’ అని చాలా సాధారణంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆమెలో ఎలాంటి భయంగానీ, ఆందోళనగానీ కనిపించలేదు.
సోమవారం ఉదయం సంభవించిన ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల రైళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు తరచూ సంభవిస్తుంటాయి. 2011లో క్రైస్ట్చర్చ్ నగరంలో భూకంపం 185 మందిని పొట్టనబెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.