దేశవ్యాప్తంగా ఈద్‌ వేడుకలు

దేశవ్యాప్తంగా ఈద్‌ వేడుకలను భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు జరుపుకొంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో...

Updated : 25 May 2020 10:09 IST

దిల్లీ : దేశవ్యాప్తంగా ఈద్‌ వేడుకలను భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు జరుపుకొంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో తొలిసారి మసీదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌, కేరళలో నిన్నే ఈద్‌ వేడుకలు నిర్వహించారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఈద్‌ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘కరుణ, సేవాతత్పరత, సుహృద్భావానికి ఈ పండగ ప్రతీక. మీ జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని కలగజేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఇళ్లలోనే భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలి’ అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని