ప్రాణభయంతో ముందుకెళ్లిన మృగరాజులు

గుజరాత్‌ రాష్ట్రం ఆమ్రేలిలోని హలారియా గ్రామంలో జరిగిన ఓ ఘటన  నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది. ట్రాక్టర్‌ నడుపుకుంటూ...

Published : 25 May 2020 11:43 IST

ఆమ్రేలి : గుజరాత్‌ రాష్ట్రం ఆమ్రేలిలోని హలారియా గ్రామంలో జరిగిన ఓ ఘటన వీడియో వైరల్‌ అవుతోంది. ట్రాక్టర్‌ నడుపుకుంటూ వెళ్తున్న రైతులకు అకస్మాత్తుగా రెండు  సింహాలు ఎదురొచ్చాయి. ఒక్కసారిగా సింహాలను చూసి బెదిరిపోయిన డ్రైవర్‌ వాహనాన్ని నిలిపివేశాడు. అయితే మృగరాజులు వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాయి. ట్రాక్టర్‌పై ఉన్న ఓ వ్యక్తి మాత్రం సింహాలను కవ్వించే ప్రయత్నం చేశాడు. అయినా సింహాలు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ఠీవీగా ముందుకు అడుగులేశాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని