రేపట్నుంచి విమాన సర్వీసులు పెరిగే అవకాశం
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం అన్ని జాగ్రత్తలూ చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రయాణికుల వివరాలు తమ వద్ద ఉంటాయని, ఏదైనా అవసరమొచ్చినప్పుడు వారితో మాట్లాడతామని
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం అన్ని జాగ్రత్తలూ చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రయాణికుల వివరాలు తమ వద్ద ఉంటాయని, ఏదైనా అవసరమొచ్చినప్పుడు వారితో మాట్లాడతామని తెలిపారు. నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శంషాబాద్ విమానాశ్రయాన్ని రంగారెడ్డి కలెక్టర్తో కలిసి సందర్శించారు. అక్కడి అరైవెల్ మార్గాన్ని పరిశీలించారు.
కరోనా లక్షణాలు కనిపిస్తే అన్ని రకాల పరీక్షలు చేస్తామని ఈ సందర్భంగా సీఎస్ తెలిపారు. ప్రయాణికుల వద్ద తప్పకుండా ఆరోగ్య సేతు యాప్ ఉండాలని సూచించారు. విమానం ఎక్కేముందు ప్రతి ప్రయాణికుడి ఉష్ణోగ్రత పరిశీలిస్తున్నామని, తక్కువగా ఉంటే అతడు ఏ వస్తువునూ ముట్టుకోకుండానే విమానంలోకి అడుగుపెట్టే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని నాన్ టచ్ విధానంలో జరుగుతున్నాయని తెలిపారు. ఇవాళ 19 చొప్పున విమానాలు వచ్చి వెళతాయని, రేపటి నుంచి విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని సీఎస్ చెప్పారు. ప్రయాణికులు లేకే కొన్ని విమానాలు రద్దు అవుతున్నాయని వివరించారు. కరోనా లక్షణాలు లేనివారికి క్వారంటైన్ లేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం