పాక్‌ గూఢచారి పావురం దొరికింది..

ఒక అనుమానాస్పద గూఢచార పావురాన్ని అంతర్జాతీయ సరిహద్దులో పట్టుకున్నట్టు భద్రతాదళ అధికారులు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామస్థులకు

Updated : 26 May 2020 11:48 IST

శ్రీనగర్‌: ఒక అనుమానాస్పద గూఢచార పావురాన్ని అంతర్జాతీయ సరిహద్దులో పట్టుకున్నట్టు భద్రతాదళ అధికారులు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామస్థులు హిరానగర్‌ సెక్టార్‌ వద్ద దొరికిన ఒక పావురాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అది పాకిస్థాన్‌ బోర్డర్‌ వైపు ఎగురుతుండగా కింద పడిపోయిందని వారు తెలిపారు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా దాని కాళ్లకు ఒక చిన్న రింగు ఉండటం పోలీసులు గుర్తించారు. దానిపై ప్రత్యేక కోడింగ్‌తో కూడిన సంఖ్యలు ఉండటంతో అది పాక్‌ గూఢచార కపోతంగా కథువా జిల్లా  ఎస్పీ శైలేంద్రమిశ్రా నిర్థారించారు. దాన్ని ఆర్మీ అధికారులకు అప్పగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని