మరో ‘మహా’ మంత్రికి కరోనా పాజిటివ్
మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా వైరస్ సోకినట్టు విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయిన సదరు మంత్రి చికిత్స నిమిత్తం సోమవారం లీలావతి ఆసుపత్రిలో చేరినట్టు
ముంబయి: మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా వైరస్ సోకినట్టు విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయిన సదరు మంత్రి చికిత్స నిమిత్తం సోమవారం లీలావతి ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఎన్సీపీ నాయకుడు, మంత్రి జితేంద్ర అవాద్కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా, ఆ మహమ్మారి వైరస్ సోకిన కేబినెట్ మంత్రుల్లో ప్రస్తుతం ఈయన రెండోవాడు. గతవారం సదరు మంత్రి తన సొంత జిల్లా వెళ్లేముందు ముంబయిలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరిగి సోమవారం ఉదయం తన సొంత ఊరి నుంచి ముంబయి రాగా కరోనావైరస్కు సంబంధించిన లక్షణాలు బయటపడ్డాయి. హుటాహుటిన ఆయన స్వాబ్ నమూనాలను కొవిడ్-19 పరీక్షకు తరలించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో ఆయనకు చికిత్సనందిస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. అంతకుముందు కరోనాపాజిటవ్ తేలిన గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్రఅవాద్ కరోనా నుంచి కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం మరింత మెరుగయ్యేందుకు ముంబయిలోని మరో ఆసుపత్రికి తరలించినట్టు అక్కడి వైద్యులు ధృవీకరించారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 50,231 కేసులు నమోదు కాగా, 14,600 మంది కోలుకున్నారు. 1635 మంది మృత్యవాత పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..