పంజా విసిరి..చివరికి బందీ అయిన చిరుత

నల్గొండ జిల్లాలో చిరుత కలకలం రేపింది. మర్రిగూడ మండలం రాజిపేట తండా వద్ద చిరుత ముళ్లకంచెలో చిక్కుకుంది...

Updated : 28 May 2020 12:31 IST

మర్రిగూడ: నల్గొండ జిల్లాలో చిరుత కలకలం రేపింది. మర్రిగూడ మండలం రాజిపేట తండా వద్ద చిరుత ముళ్లకంచెలో చిక్కుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది ముళ్ల కంచె నుంచి చిరుతను తప్పించే ప్రయత్నం చేశారు.  ఈక్రమంలో అటవీశాఖ సిబ్బందిపై చిరుత పులి దాడి చేసింది. ఈఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయినా, ధైర్యంగా ఆపరేషన్‌ కొనసాగించిన అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు చిరుతను బోనులో బంధించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని