వరవరరావు విషయంలో జోక్యం చేసుకోవాలి

తలోజా జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న విరసం నేత వరవరరావుకు వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన కుమార్తెలు అనల, పవన..

Published : 30 May 2020 14:40 IST

కిషన్‌ రెడ్డిని కోరిన వరవరరావు కుమార్తెలు

హైదరాబాద్‌: ముంబయిలోని తలోజా జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న విరసం నేత వరవరరావుకు వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన కుమార్తెలు అనల, పవన కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వరవరరావు మూడు రోజులుగా అనారోగ్యంతో ఉంటే.. జైలు అధికారులు ముంబయి జేజే ఆసుపత్రికి తరలించినట్లు తెలిసిందన్నారు. దీనికి సంబంధించి జైలు అధికారులు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జైలులో కరోనాతో ఓ ఖైదీ మృతి చెందారని.. అయినా జైలులో పరిశుభ్రత చర్యలు తీసుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 17 గంటల పాటు ఒకే బారక్‌లో 30 మంది ఖైదీలను ఉంచుతున్నారని, జైలులో సరైన సౌకర్యాలు లేవని  వరవరరావు కుమార్తెలు వివరించారు.

బీమా కొరేగావ్‌ కేసులో వరవరరావుపై పలు ఆరోపణలు చేస్తూ అరెస్టు చేశారని, బెయిల్‌ కోసం దరఖాస్తు చేస్తే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని బెయిల్‌ మంజూరయ్యేలా చూడాలని వరవరరావు కుమార్తెలు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని