జాతీయ హోదా ఇస్తామని చెప్పలేదు: కిషన్రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ...
దిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించిందని గుర్తు చేశారు. దేశంలో అనేక పేద రాష్ట్రాలున్నాయని.. అలాంటి చోట కూడా జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టులు లేవన్నారు. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చినట్లు అయితే తెలంగాణ ప్రాజెక్టులకు కూడా జాతీయహోదా కోసం కృషి చేస్తానన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలోనే అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కిషన్ రెడ్డి కొనియాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా భారతీయ ఉత్పత్తి, తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా నిర్ధేశించుకున్న సమయంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిందని.. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని కిషన్ రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు