జాతీయ హోదా ఇస్తామని చెప్పలేదు: కిషన్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ...

Updated : 30 May 2020 15:24 IST

దిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించిందని గుర్తు చేశారు. దేశంలో అనేక పేద రాష్ట్రాలున్నాయని.. అలాంటి చోట కూడా జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టులు లేవన్నారు. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చినట్లు అయితే తెలంగాణ ప్రాజెక్టులకు కూడా జాతీయహోదా కోసం కృషి చేస్తానన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలోనే అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కిషన్‌ రెడ్డి కొనియాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా భారతీయ ఉత్పత్తి, తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా నిర్ధేశించుకున్న సమయంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిందని.. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని కిషన్‌ రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని