ఎస్ఈసీ బాధ్యతల స్వీకరణ ఉత్తర్వులు వెనక్కి
నిమ్మగడ్డ రమేశ్కుమార్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయన బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఇచ్చిన ఉత్వర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్ఈసీ కార్యదర్శి ప్రకటించారు. ఆయన పునర్ నియామకానికి సంబంధించి..
వెల్లడించిన ఎస్ఈసీ కార్యదర్శి
అమరావతి: నిమ్మగడ్డ రమేశ్కుమార్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయన బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఇచ్చిన ఉత్వర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్ఈసీ కార్యదర్శి ప్రకటించారు. ఆయన పునర్ నియామకానికి సంబంధించి అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరాలు లేవనెత్తిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
అంతకుముందు ఏజీ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఎప్పటిలోగా నియమించాలనే విషయంలో హైకోర్టు నిర్దిష్ట గడువేమీ విధించలేదని ఆయన అన్నారు. తీర్పు అమలుకు కోర్టు కాలపరిమితి విధించకపోతే రెండు నెలలు గడువు ఉంటుందని చెప్పారు. అయితే ఈలోపే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనకు తానుగా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటన విడుదల చేశారని, బాధ్యతలు చేపట్టినట్లు వివిధ శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారని చెప్పారు. ఆయనను ఎస్ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందే తప్ప.. బాధ్యతలు తీసుకోవాలని రమేశ్కుమార్కు చెప్పలేదని ఏజీ తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలంటే చట్టపరమైన చిక్కులున్నాయని, కొన్ని అంశాల్లో సందిగ్ధత ఉన్నందునే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావించినట్లు ఏజీ శ్రీరాం స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు