తేనెటీగల దాడితో ఇబ్బందిపడ్డ చిరంజీవి కుటుంబం

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు.

Updated : 31 May 2020 13:58 IST

కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. దోమకొండ గడీకోటలోని లక్ష్మీబాగ్‌లో దహన సంస్కారాలు నిర్వహించే క్రమంలో తేనెటీగలు చెలరేగడంతో ఆటంకం కలిగింది. తేనెటీగలు ఒక్కసారిగా రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. అంత్యక్రియలకు హాజరైన సినీనటుడు చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్‌, ఉపాసన తదితరులు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపటి తర్వాత తేనెటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు కొనసాగాయి. ఉమాపతిరావు కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్‌ శరత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజాస్‌ నందన్‌ లాల్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే పలువురు ప్రముఖులు పరామర్శించారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని