తాజ్మహల్ సమీపంలో పిడుగు
పిడుగుల ధాటికి చారిత్రక కట్టడం తాజ్మహల్లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి ఆగ్రాలోని తాజ్మహల్ ప్రాంతం పిడుగుల
ఆగ్రా: పిడుగుల ధాటికి చారిత్రక కట్టడం తాజ్మహల్ ప్రాంగణంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి ఆగ్రాలోని తాజ్మహల్ ప్రాంతం పిడుగుల శబ్దంతో దద్దరిల్లింది. దీంతో ప్రఖ్యాత భారత వారసత్వ సంపదైన తాజ్మహల్కు సంబంధించిన ప్రధాన ద్వారంతో పాటు ప్రధాన గుమ్మటానికి అనుకుని ఉన్న మిగతా గుమ్మటాల పిట్టగోడలు దెబ్బతిన్నాయి. దీనిపై భారత పురావస్తుశాఖ అధికారి వసంత్కుమార్ సావర్కర్ మాట్లాడుతూ.. ‘‘పిడుగుల ధాటికి రాతితో నిర్మించిన పిట్టగోడ భాగం దెబ్బతింది. అలాగే పాలరాతితో నిర్మించిన మరో పిట్టగోడ, పర్యాటకులు నిల్చునే ప్రాంతంలోని పై భాగం, ప్రధాన ద్వారం వద్ద ఉన్న గోడలు దెబ్బతిన్నాయి. ప్రధాన గుమ్మటానికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. వెంటనే వాటి పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్తో గత రెండు నెలలుగా తాజ్మహల్ ప్రాంతానికి పర్యాటకులు అనుమతిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పిడుగుల ధాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 13 మంది మృత్యువాత పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ