తాజ్‌మహల్‌ సమీపంలో పిడుగు

పిడుగుల ధాటికి చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ ప్రాంతం పిడుగుల

Updated : 22 Dec 2022 17:15 IST

ఆగ్రా: పిడుగుల ధాటికి చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ ప్రాంగణంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ ప్రాంతం పిడుగుల శబ్దంతో దద్దరిల్లింది. దీంతో ప్రఖ్యాత భారత వారసత్వ సంపదైన తాజ్‌మహల్‌కు సంబంధించిన ప్రధాన ద్వారంతో పాటు ప్రధాన గుమ్మటానికి అనుకుని ఉన్న మిగతా గుమ్మటాల పిట్టగోడలు దెబ్బతిన్నాయి. దీనిపై భారత పురావస్తుశాఖ అధికారి వసంత్‌కుమార్‌ సావర్కర్‌ మాట్లాడుతూ.. ‘‘పిడుగుల ధాటికి రాతితో నిర్మించిన పిట్టగోడ భాగం దెబ్బతింది. అలాగే పాలరాతితో నిర్మించిన మరో పిట్టగోడ‌, పర్యాటకులు నిల్చునే ప్రాంతంలోని పై భాగం, ప్రధాన ద్వారం వద్ద ఉన్న గోడలు దెబ్బతిన్నాయి.  ప్రధాన గుమ్మటానికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. వెంటనే వాటి పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా తాజ్‌మహల్‌ ప్రాంతానికి పర్యాటకులు అనుమతిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పిడుగుల ధాటికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 13 మంది మృత్యువాత పడ్డారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు