జగన్ దిల్లీ పర్యటన వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి దిల్లీ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నం సీఎం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి దిల్లీ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం దిల్లీ చేరుకుని 3గంటలకు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర షెకావత్తో, సాయంత్రం 4.45కి గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో, రాత్రి 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించాల్సి ఉంది. అయితే, కరోనా లాక్డౌన్ సడలింపుల పరిణామాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీగా ఉండటంతో సీఎం పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం. జగన్ దిల్లీ పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?