
విద్యుత్ తీగలపై నడిచి.. చెట్టుకొమ్మని తీసి
సాహసం చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి
నిజాంపూర్: ఈదురు గాలులకు విద్యుత్ తీగలపై పడిన చెట్టుకొమ్మను తొలగించడానికి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి సాహసం చేశాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం నిజాంపూర్లో గాలి ఉద్ధృతికి ఓ చెట్టు కొమ్మ విద్యుత్ తీగలపై పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నూర్.. స్తంభం ఎక్కి విద్యుత్ తీగలపై నడుచుకుంటూ వెళ్లి కొమ్మను తొలగించాడు. ఆ యువకుడు క్షేమంగా కిందికి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఇంతటి ప్రమాదకర పని చేయించడంపై విద్యుత్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.