తేమ తగ్గితే కరోనా కాటు!
వాతావరణంలోని తేమకు, కరోనా వ్యాప్తికి లంకె ఉందంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. వాతావరణంలోని తేమ ఒక శాతం తగ్గినప్పుడు కొవిడ్-19 కేసులు ఆరు శాతం మేర పెరిగే......
కొవిడ్ సీజనల్ వ్యాధిగా మారొచ్చు
ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి
మెల్బోర్న్: వాతావరణంలోని తేమకు, కరోనా వ్యాప్తికి లంకె ఉందంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. వాతావరణంలోని తేమ ఒక శాతం తగ్గినప్పుడు కొవిడ్-19 కేసులు ఆరు శాతం మేర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానిక వాతావరణం కరోనా వైరస్ వ్యాప్తికి ఎలా కారణమవుతుందనే అంశంపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ట్రాన్స్బౌండరీ అండ్ ఎమర్జింగ్ డిసీజెస్ అనే జర్నల్లో ఈ పరిశోధన ప్రచురితమైంది. దక్షిణార్థగోళంలో వైరస్కు, వాతావరణానికి గల సంబంధాన్ని ఇందులో పేర్కొన్నారు. అలాగే, కరోనా కూడా కాలానుగుణ (సీజనల్) వ్యాధి కాగలదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
సీజనల్గా వాతావరణంలో తేమ శాతం తగ్గినప్పుడు ఈ వైరస్ తిరిగి పుంజుకొనే అవకాశం ఉందని సహ పరిశోధకుడు, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలో ఎపిడమాలజిస్ట్ మైకెల్ వార్డ్ తెలిపారు. చలికాలం కొవిడ్-19 కాలం కాగలదని పేర్కొన్నారు. దక్షిణార్థగోళంలో చలికాలం మొదలైతే వాతావరణంలోని తేమకు, కొవిడ్ వ్యాప్తికి గల సంబంధాన్ని అంచనా వేయడానికి వీలు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2002-03లో చైనా, హాంకాంగ్లో విస్తరించిన సార్స్-కోవ్, అలాగే సౌదీ అరేబియాలో సంభవించిన మెర్స్-కోవ్ సమయంలో అక్కడి వాతావరణ పరిస్థితులకు, వైరస్ వ్యాప్తికి గల సంబంధంపై వచ్చిన పరిశోధనలను ఉదహరించారు. చైనాలో ఇటీవల సంభవించిన కరోనా వ్యాప్తికి, వీటికి మధ్య సంబంధంపై వచ్చిన మరో పరిశోధనను సైతం ఉదహరించారు.
తేమతో ఉన్న లంకె ఇదీ..
గాలి ద్వారా వ్యాపించే వైరస్ల విస్తరణకు తక్కువ తేమ ఎలా కారణం అనే అంశాన్ని పరిశోధకులు వివరించారు. గాలిలో తేమ తగ్గినప్పుడు గాలి పొడిగా మారి మనిషి నుంచి వెలువడే తుంపర్లు చిన్నవిగా మారుతాయి. మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే ఆ తుంపర్లు చిన్నగా మారి గాలిలో ఎక్కువ సేపు నిలవగలవని పరిశోధకులు పేర్కొన్నారు. దీంతో ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అదే తేమ ఎక్కువగా ఉంటే తుంపర్లు పెద్దవిగా, బరువుగా ఉండి వెంటనే నేలపైకి చేరే అవకాశం ఉంటుందని తెలిపారు.
పరిశోధన ఇలా..
ఫిబ్రవరి 26 నుంచి మార్చి 31 మధ్య సైంటిస్టులు సిడ్నీ పరిసర ప్రాంతాల్లో 749 మంది కరోనా బాధితులపై ఈ పరిశోధన జరిపారు. బాధితుల నుంచి వారి పోస్టల్ పిన్కోడ్లను తీసుకున్నారు. వారి చిరునామా ఆధారంగా అక్కడి స్థానిక వాతావరణ కేంద్రంలోని ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం వంటి వివరాలతో సరిపోల్చారు. దీని ఆధారంగా తక్కువ తేమ ఉన్నప్పుడు ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని తేల్చారు. కాబట్టి, రాబోయే శీతకాలంలో ఆస్ట్రేలియా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందరు. ఆస్ట్రేలియాలో సాధారణంగా తక్కువ తేమ శాతం ఆగస్టులో నమోదు అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ పొంచి ఉన్న ముప్పు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వార్డ్ హెచ్చరించారు. చలికాలంలో కరోనాకు అనుకూలంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ, పెద్ద ఎత్తున టెస్టింగులు చేపట్టడం ఒక్కటే ముందున్న మార్గమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్