ఫిట్నెస్ బ్యాండ్తో ఫిట్ అవ్వండి
బాడీ ఫిట్నెస్ కోసం చాలా మంది ఆరాటపడుతుంటారు. ఫిట్గా ఉంటేనే ఏదైనా పనిని ఉత్సాహంగా, చలాకీగా చేయగలం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫిట్ ఇండియా
ఇంటర్నెట్ డెస్క్: శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు చాలా మంది ఆరాటపడుతుంటారు. ఫిట్గా ఉంటేనే ఏదైనా పనిని ఉత్సాహంగా, చలాకీగా చేయగలం. ఫిట్నెస్ కోసం వయస్సుతో సంబంధం లేకుండా అందరూ తమకు తోచిన విధంగా కసరత్తులు చేస్తుంటారు. కొందరు జిమ్లో వర్కవుట్స్ చేస్తే.. మరికొందరు యోగా, రన్నింగ్, జాగింగ్ చేస్తుంటారు. ఇంకొందరు షటిల్, టెన్నిస్ లాంటి ఆటలతో కేలరీలను కరిగించుకుంటారు. అయితే కొంత మంది టార్గెట్స్ ఉంటేనే వర్కవుట్స్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. నిర్దేశిత సమయంలోనే కసరత్తులు పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం ఫిట్నెస్ బ్యాండ్స్ బాగా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ బ్యాండ్తో వచ్చే లాభాలు.. ఉపయోగాలు గురించి మీరూ తెలుసుకోండి.
నిద్రపై నిఘా
మానసికంగా.. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైనంత సమయం నిద్ర పోవాలి. సాధారణంగా రోజులో ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు మనం నిద్ర పోతుంటాం. అయితే ఇందులో ఎంతసేపు మీరు గాఢంగా నిద్ర పోయారు.. ఎంతసేపు కలత నిద్రలో ఉన్నాం లాంటి విషయాలను ఫిట్నెస్ బ్యాండ్తో ట్రాక్ చేయొచ్చు. దీనివల్ల మీరు ఎంతసేపు హాయిగా నిద్రపోయారో ఇట్టే తెలుసుకునే వీలు చిక్కుతుంది. ఫలితంగా మీ నిద్రపై మీరు నిఘా వేసిన వారవుతారు.
కేలరీలను లెక్కేయండి
మనం తిన్న ఆహారం కేలరీల రూపంలో శరీరానికి శక్తి అందిస్తుంది. ఒకవేళ ఇవి శరీర అవసరానికి మించి ఉంటే కొవ్వు రూపంలో నిల్వ అవుతాయి. మళ్లీ శరీరానికి అవసరమైనప్పుడు ఈ ఎక్స్ట్రా కేలరీలు శక్తిని అందిస్తాయి. అయితే ఎక్కువగా పేరుకు పోయిన కేలరీలను కరిగించకపోతే మనిషి లావైపోతాడు. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ అదనపు కేలరీలను కరిగించాలి. ఒకరోజులో మీరు చేసిన వ్యాయామం వల్ల ఎన్ని కేలరీలు కరిగాయో ఫిట్నెస్ బ్యాండ్ లెక్కిస్తుంది. దీనివల్ల మీలో ఎక్కువగా కేలరీలను కరిగించాలన్న కోరిక పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎంతదూరం నడిచిన విషయం కూడా బ్యాండ్స్ తెలుపుతాయి.
టార్గెట్స్ పెట్టుకోవచ్చు
ఫిట్నెస్ బ్యాండ్తో లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. ఎంత దూరం నడవాలి.. ఎంత సేపు వర్క్ అవుట్స్ చేయాలో సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మొబైల్లో బ్యాండ్కు సంబంధించిన అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఎప్పటికప్పుడు యాప్లో సెట్టింగ్స్ను మార్చుకోవచ్చు. వీటితో పాటు ఫిటినెస్ బ్యాండ్ ద్వారా హార్ట్ బీట్ రేట్ను తెలుసుకోవడం, మొబైల్ కాల్స్ను మేనేజ్ చేయడం, వాట్సాప్ మెసేజ్లను నోటిఫికేషన్ రూపంలో చూడడం, అలారమ్ను సెట్ చేసుకోవడం లాంటి ఆప్షన్స్ పొందవచ్చు. ఇలా ఫిట్నెస్ బ్యాండ్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు