ఆంగ్ల మాధ్యమంపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన 81, 85 జీవోలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం.....

Updated : 04 Jun 2020 22:04 IST

అమరావతి: రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన 81, 85 జీవోలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుతున్నారని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకే ఆంగ్ల మాధ్యమంపై జీవోలు తీసుకొచ్చామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అ అంశంపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని