ఆరుగురికి కరోనా..దిల్లీ ఈడీ ఆఫీస్ మూసివేత
కరోనా వైరస్ దిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయానికి తాకింది. తాజాగా అందులో పనిచేసే ఆరుగురు అధికారులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. కొవిడ్ బాధిత అధికారులతో సన్నిహితంగా ఉన్న పది మందికిపైగా వ్యక్తులను క్వారంటైన్ చేశారు.
దిల్లీ: దేశరాజధానిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కొవిడ్ బారిన పడుతుండటంతో వాటిని మూసివేస్తున్నారు. తాజాగా దిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయానికి వైరస్ సెగ తాకింది. అందులో పనిచేసే ఆరుగురు అధికారులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో సన్నిహితంగా ఉన్న పది మందికిపైగా సిబ్బందిని క్వారంటైన్ చేశారు. శానిటైజేషన్ పనులు చేపట్టేందుకు ప్రధాన కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాన్ని అధికారులు వారానికి రెండు రోజులు శానిటైజేషన్ చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఉద్యోగులు హాజరవుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు రావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇదీ చదవండి..
24 గంటల్లో 9,887 కేసులు..294 మరణాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!