నిమ్మగడ్డ పునర్నియామకంపై సుప్రీంకు ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్నియామకంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను పునర్నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌ను..

Published : 06 Jun 2020 22:43 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్నియామకంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను పునర్నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 10వ తేదీ విచారణ జాబితాలో చేర్చుతూ హైకోర్టు రిజిస్ట్రీ జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై 10వ తేదీన విచారించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని