గ్యాస్‌ దుర్ఘటనపై హైపవర్‌ కమిటీ విచారణ

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై విశాఖలో రెండో రోజు హైపవర్‌ కమిటీ విచారణ కొనసాగుతోంది. జీవీ ఎంసీ సమావేశ మందిరంలో  గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలు...

Updated : 07 Jun 2020 13:05 IST

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై విశాఖలో రెండో రోజు హైపవర్‌ కమిటీ విచారణ కొనసాగుతోంది. జీవీ ఎంసీ సమావేశ మందిరంలో  గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలు, వివిధ పార్టీల నేతలతో హైపవర్‌ కమిటీ వేర్వేరుగా భేటీ అయింది. ఎల్జీ దుర్ఘటన ప్రభావిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన 21 మంది గ్రామస్థులు సమావేశంలో పాల్గొన్నారు. ఆధార్‌కార్డులు పరిశీలించిన అనంతరం పోలీసులు వారిని లోపలికి పంపుతున్నారు. ఆధార్‌ కార్డు వివరాలు సరిగ్గా లేవని సమావేశం వద్దకు అనుమతించడం లేదని మృతుల బంధువులు వాపోయారు. తమ సమస్యలు ఎవరూ పట్టించుకోలేదని, కమిటీ వద్ద అయినా గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్‌ దుర్ఘటనలో మృతి చెందిన కనకరాజు భార్య సమావేశంలో పాల్గొనేందుకు రాగా.. అనుమతిలేదని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె జీవీఎంసీ గేటు వద్దే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని