జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా పరీక్షలు

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల నగరంలో పర్యటన సందర్భంగా మేయర్‌ ఓ హోటల్‌లో టీ

Published : 07 Jun 2020 15:54 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల నగరంలో పర్యటన సందర్భంగా మేయర్‌ ఓ హోటల్‌లో టీ తాగినట్లు అధికారులు చెప్పారు. మేయర్‌ టీ తాగిన దుకాణంలోని టీ మాస్టర్‌కు గతంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని