అయిదుగురు మిలిటెంట్ల హతం
ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో అయిదుగురు గుర్తుతెలియని మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే జమ్మూ-కశ్మీర్లోని షోపియన్
శ్రీనగర్: ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో అయిదుగురు గుర్తుతెలియని మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే జమ్మూ-కశ్మీర్లోని షోపియన్ జిల్లా, రిబాన్ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నట్టు భద్రతాదళాలకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. వీరి రాకను గమనించిన మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. వారిని నిలువరించేందుకు భద్రతా దళాలు కాల్పులు ఆరంభించిన కాసేపటికే మిలిటెంట్లు అయిదుగురు హతమయ్యారు. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో తేలాల్సిఉందని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..