ఆ శవం తన తండ్రిదే అనుకుని..
ఇద్దరు వ్యక్తులు ఒకే పేరు కలిగిఉండటం, ఆసుపత్రి శవాగార సిబ్బంది తప్పిదం వెరసి ఓ వ్యక్తి తన తండ్రి శవం అనుకుని వేరే మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేశాడు. తీరా తన తండ్రి శవాన్ని
దిల్లీ: ఇద్దరు వ్యక్తులు ఒకే పేరు కలిగిఉండటం, ఆసుపత్రి శవాగార సిబ్బంది తప్పిదం వెరసి ఓ వ్యక్తి తన తండ్రి శవం అనుకుని వేరే మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేశాడు. తీరా తన తండ్రి శవాన్ని గుర్తించాక మరోసారి అంతిమ సంస్కారాలు చేశాడు. వివరాల్లోకి వెళితే దిల్లీకి చెందిన కాలముద్దీన్ తండ్రి మొయినుద్దీన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలిసిస్ కోసం లోక్నాయక్ ఆసుపత్రికి జూన్ 4న వచ్చారు. ఈ క్రమంలోనే అతనికి కొవిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు. కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో అదేరోజు రాత్రి మొయినుద్దీన్ మరణించాడు. దీంతో అతడి శవాన్ని తీసుకెళ్లి మార్చురీలో ఉంచారు. మరోవైపు మొయినుద్దీన్ అనే మరోవ్యక్తి రక్తపోటు వ్యాధితో బాధుపడుతుండగా జూన్ 2న అతని సోదరుడు అజీజుద్దీన్ సహాయంతో ఇదే లోక్నాయక్ ఆసుపత్రిలో చేరాడు. వ్యాధి తీవ్రం కావడంతో రెండోరోజు మరణించాడు. ఇతని శవాన్ని కూడా సిబ్బంది శవాగారంలో ఉంచారు. కరోనా నేపధ్యంలో శవాలన్నింటిని కవర్ చుట్టి ఉంచి, బంధువులు గుర్తించేందుకు పాక్షికంగా మాత్రమే తెరుస్తున్నారు. దీంతో కాలముద్దీన్ తన తండ్రి శవం అనుకుని రక్తపోటుతో చనిపోయిన మరో మొయినుద్దీన్ శవానికి దిల్లీ గేట్ సమీపంలోని శ్మశానంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు. అజీజుద్దీన్ తన అన్న శవం కోసం శవాగారానికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. విషయాన్ని సిబ్బంది కాలముద్దీన్కు తెలుపడంతో చివరకు తన తండ్రి శవానికి అంతిమ సంస్కారాలు చేయగలిగాడు. రక్తపోటుతో మరణించిన మొయినుద్దీన్కు కొవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలగా, అతని మరణవార్త విని భార్య కూడా గుండెపోటుతో మరణించడం శోచనీయం. ఘటనపై ఆసుపత్రి పై అధికారులు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు