వలస కూలీల కోసం కేంద్రం కొత్త పథకం
లాక్డౌన్ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం...
దిల్లీ: లాక్డౌన్ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వలస కూలీలకు వారి సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వలస కూలీలు అధికంగా ఉన్న 116 జిల్లాల జాబితాను సిద్ధం చేసి వారికి ఎలాంటి పనులు కల్పించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ), ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ద్వారా వారికి ఉపాధి కల్పించనున్నారు. అలానే జన్ ధన్ యోజన, కిసాన్ కళ్యాణ్ యోజన, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, పీఎం ఆవాస్ యోజన పథకాలను కూడా ఇందుకు ఉపయోగించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం అన్ని మంత్రిత్వశాఖల నుంచి నివేదికలు సేకరించినట్లు వెల్లడించారు. మొత్తం 116 జిల్లాలు రాష్ట్రాల వారీగా బిహార్ - 32, ఉత్తరప్రదేశ్ - 31, మధ్యప్రదేశ్ - 24, రాజస్థాన్ - 22, ఒడిశా - 4, ఝార్ఖండ్ - 3 ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు ఆయా జిల్లాల్లో వలస కూలీలను గుర్తించే పనిలో నిమగ్నమయినట్లు తెలిపారు.
కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయడంతో దేశవ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపార, నిర్మాణ రంగ సంస్థలు మూతపడ్డాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు వారి స్వంత గ్రామాలకు పయనమయ్యారు. దీంతో వారిని ఆదుకోవడంలో కేంద్రం విఫలమయిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక రైళ్లు ఏర్పాటు చేసి వారిని తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకున్న వలస కార్మికులు, కూలీలను ఆదుకునే దిశగా కేంద్రం ఈ కార్యచరణ సిద్ధం చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!