వలస కూలీలపై కేసులు ఎత్తేయాలి: సుప్రీం
వలస కూలీల అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వలస
దిల్లీ: వలస కూలీల అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీలను గుర్తించి 15 రోజుల్లో తరలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వలస కూలీలపై నమోదు చేసిన లాక్డౌన్ ఉల్లంఘన కేసులు ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి, వారికి ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారో వివరిస్తూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనికి సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై 8కి వాయిదా వేసింది. లాక్డౌన్ విధించిన తర్వాత వలస కూలీలు కాలినడకన స్వస్థలాలకు బయలుదేరిన ఘటనలు చూసిన సర్వోన్నత న్యాయస్థానం వలస కూలీల అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.