మృతులకు కరోనా పరీక్షలు సాధ్యంకాదు:ఈటల

మృతి చెందిన వారికి కొవిడ్‌ పరీక్షలు చేయాలనే హైకోర్టు వాదన అశాస్త్రీయమైనదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. మృతులందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన

Updated : 09 Jun 2020 16:54 IST

హైదరాబాద్‌: మృతి చెందిన వారికి కొవిడ్‌ పరీక్షలు చేయాలనడం అశాస్త్రీయమైనదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. మృతులందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడినవారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. కరోనా సోకిన వారందరినీ బతికించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

‘‘చనిపోయిన వారికి కొవిడ్‌ పరీక్షలు చేయాలనడం అవగాహన రాహిత్యంతో కూడుకున్నది. ఐసీఎంఆర్‌ నిబంధనల్లో ఎక్కడ కూడా భౌతికకాయానికి పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదు. రాష్ట్రంలో నిత్యం వెయ్యిమంది మరణిస్తున్నారు. దేశంలో నిత్యం 30వేల మంది చనిపోతున్నారు. వారందరికీ టెస్టులు చేయడం సాధ్యం కాదు’’ అని ఈటల స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని