గంటల తరబడి ఎండ ఉన్నా... వైరస్ విజృంభణకు ఆస్కారం!
వాతావరణంలో అధిక వేడి, తేమ ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పడం విన్నాం. అయితే... గంటల తరబడి ఎండ ఉన్నా వైరస్
టొరంటో: వాతావరణంలో అధిక వేడి, తేమ ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పడం విన్నాం. అయితే... గంటల తరబడి ఎండ ఉన్నా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది! ఎక్కువసేపు ఎండ కాయడం ప్రజల ప్రవర్తనలో మార్పులకు కారణమవుతోందని, ఫలితంగా ఎక్కువమంది వైరస్ బారిన పడేందుకు ఆస్కారం ఏర్పడుతోందని కెనడాకు చెందిన మెక్మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో కరోనా కేసుల తీరు ఎలా ఉందన్న విషయమై వీరు అధ్యయనం సాగించారు. సుమారు 3 లక్షల కొవిడ్-19 కేసులతో అల్లాడుతున్న స్పెయిన్లో వారు 30 రోజుల పాటు విశ్లేషణ చేపట్టారు. ‘‘వాతావరణంలో వేడి, తేమ ఒక్క శాతం పెరిగితే, కొవిడ్-19 వ్యాప్తి 3% తగ్గుతున్నట్టు గుర్తించాం. అధిక ఉష్ణోగ్రతలు వైరస్ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే ఇందుక్కారణం. అలాగని గంటల తరబడి ఎండ ఉన్న రోజుల్లోనూ వైరస్ వ్యాప్తి అధికమవుతోంది. ఎక్కువసేపు ఎండ ఉన్న రోజుల్లో ప్రజలు లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి బయటకు వస్తున్నారు. ఫలితంగా వైరస్ సంక్రమణం ఎక్కువవుతోంది’’ అని పరిశోధనకర్త ఆంటానియో పయీజ్ వివరించారు. జియోగ్రాఫికల్ అనాలసిస్ పత్రిక ఈ వివరాలను ప్రచురించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత