ఈ మిఠాయిలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి..!
కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే అందరూ హడలెత్తుతున్నారు. పక్కవారెవరైనా తుమ్మినా, దగ్గినా భయపడిపోతున్నారు......
కోల్కతా: కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే అందరూ హడలెత్తుతున్నారు. పక్కవారెవరైనా తుమ్మినా, దగ్గినా భయపడిపోతున్నారు. ఈ వైరస్కు మందు లేకపోవడమే ఇందుకు కారణం. పలు ప్రపంచ దేశాలు వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. కొవిడ్-19 వైరస్ బయటపడి నెలలు గడుస్తున్నా కచ్చితమైన చికిత్సా విధానం అందుబాటులోకి రాలేదు. దీన్ని నివారించాలంటే వ్యక్తిగత శుభ్రత, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజలంతా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకునేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. వైద్యుల సూచనల మేరకు రోజు వారిగా తీసుకునే ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలను జతచేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కొత్తగా ‘ఇమ్యూనిటీ సందేశ్’ మిఠాయిలు వచ్చి చేరాయి.
కోల్కతాలోని బలరామ్ ముల్లిక్, రాధారమన్ ముల్లిక్ అనే మిఠాయిల దుకాణం ఈ ‘ఇమ్యూనిటీ సందేశ్’లను అందుబాటులోకి తెచ్చింది. రోగనిరోధక శక్తిని పెంచే వివిధ మూలికలతో వీటిని తయారు చేశారు. పసుపు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, కాలా జీరా(నల్ల జీలకర్ర), ములేథి, బిర్యానీ ఆకు, తేనె తదితర రకాల మూలికలతో ఈ స్వీట్స్ను తయారు చేసినట్లు దుకాణం నిర్వాహకులు తెలిపారు. ‘‘కరోనా వైరస్కు వ్యాక్సిన్ ఇంకా రాలేదు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే సరైన మార్గం. అందుకే ఆయుర్వేద నిపుణులను సంప్రదించి 15 రకాల మూలికలతో వీటిని తయారు చేశాం. ఇందులో చక్కెర జత చేయకుండా కేవలం హిమాలయా తేనెతో మాత్రమే తయారు చేశాం. ఒక్కో మిఠాయి ఖరీదు రూ.25’’ అని దుకాణం యజమానులు తెలిపారు. ఈ మిఠాయిలకు స్థానికంగా మంచి డిమాండ్ ఉందని.. ప్రజలు వీటిని ఎంతో ఇష్టంగా తీసుకెళ్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విశ్వవ్యాప్తంగా 74,87,676 మంది కొవిడ్ బారిన పడ్డారు. అందులో 4.20లక్షల మంది మృతి చెందగా.. 35.23లక్షల మంది కోలుకున్నారు. ఇక భారత్లో ఇప్పటి వరకు 2,97,535 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. అందులో 8,498 మంది మృతి చెందగా... 1.47లక్షల మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!