లాక్‌డౌన్‌: కొత్త పెళ్లి జంటపై కేసు నమోదు

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  పెళ్లిళ్లు చేసుకోవాల్సిన...

Published : 13 Jun 2020 02:20 IST

 

రాయ్‌గఢ్‌(మహారాష్ట్ర ) : కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. అయితే ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని భావించి సామాజిక మాధ్యమాల్లో పలు జంటలు ఒక్కటవుతున్నాయి. మరికొందరు లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు సామాజిక దూరం పాటిస్తూ అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి వివాహమే చేసుకున్న ఓ జంట లాక్‌డౌన్‌ ఇబ్బందుల్లో చిక్కుకుంది. నిబంధనలు ఉల్లంఘించారంటూ వరుడు, వధువు, వారి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర రాయ్‌గఢ్‌ జిల్లా కర్జాత్‌లోని ముద్రే తహసీల్‌ ప్రాంతానికి చెందిన ఓ జంట గత ఆదివారం వివాహ బంధంతో ఒక్కటైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ శుభకార్యానికి  ముందస్తు రెవెన్యూ అనుమతితో 50 మంది మాత్రమే హాజరుకావాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా 150 మందిని ఆహ్వానించారు. దీనిపై కర్జాత్‌కు చెందిన సామాజిక కార్యకర్త హృషికేషి జోషి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో వరుడు,వధువు, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాయల్‌ గార్డెన్‌ హాల్‌లో నాలుగు వివాహ శుభకార్యాలకు అనుమతించారని జోషి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని