ఏపీ ఇంటర్ ఫలితాలు: సాంకేతిక సమస్యలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్లైన్లోనే విడుదల చేసింది. దీంతో మార్కులను చూసుకుందామని ప్రయత్నించిన విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. సాయంత్రం 4గంటలకు ఫలితాలను విడుదల చేయగా, 5గంటలకు కూడా ఫలితాలు అందుబాటులోకి రాలేదు. సాంకేతిక సమస్య కారణంగా ఫలితాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఒకేసారి ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం, అదీ ఆన్లైన్లో విడుదల చేయడంతో సర్వర్లు మొరాయించాయి. ‘ఈ సేవలు అందుబాటులో లేవు’ అన్న సందేశం కనిపించింది. దీంతో పరీక్ష ఫలితాల విషయంలో ప్రభుత్వ ఏర్పాట్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన వద్దు
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల విడుదలలో సాంకేతిక సమస్య తలెత్తడంపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్పందించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురికావొద్దని కోరింది. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేయడంతో ఫలితాల సర్వర్పై ప్రభావం పడిందని, సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు