ఈఎస్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడి తరలింపు

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ప్రాథమిక పరీక్షల అనంతరం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించిన...

Published : 12 Jun 2020 21:19 IST

విజయవాడ: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ప్రాథమిక పరీక్షల అనంతరం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ను మంగళగిరిలోని అనిశా న్యాయమూర్తి  నివాసంలో హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో అనిశా న్యాయమూర్తి నివాసం వద్ద గట్టి భత్రతా ఏర్పాట్లు చేశారు. అపార్ట్‌మెంట్‌ వైపు ఎవరూ రాకుండా వంద మీటర్ల దూరం నుంచే ఆంక్షలు విధించారు. అచ్చెన్నాయుడి న్యాయవాదులను కూడా పోలీసులు నిలిపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని