అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడికి విజయవాడ అనిశా కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనారోగ్యం దృష్ట్యా ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు. తొలుత అనిశా అధికారులు విజయవాడ సబ్ జైలుకు...
విజయవాడ:ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడికి విజయవాడ అనిశా కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనారోగ్యం దృష్ట్యా ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ మేరకు వివరాలను న్యాయవాది వెంకటేశ్వర్లు వెల్లడించారు.‘‘ అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేసుకున్న విషయం న్యాయమూర్తికి తెలిపాం. ఆస్పత్రిలో ఉంచాలని వైద్యులు సూచించారని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందించే వైద్యం గురించి కోర్టుకు నివేదిక ఇవ్వాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేశ్కుమార్ను రాజమండ్రి సబ్జైలుకు తరలించారు.’’ అని మీడియాతో చెప్పారు.
గుంటూరు జీజీహెచ్కు తరలింపు
తొలుత అనిశా అధికారులు తెల్లవారుజామున 3.30 గంటలకు అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్ జైలుకు తీసుకువచ్చారు. సుమారు గంటపాటు సబ్జైలు బయట ఎస్కార్ట్ వాహనంలోనే అచ్చెన్నాయుడు నిరీక్షించారు. అనంతరం సబ్జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన్ను సబ్జైలు నుంచి గుంటూరు జీజీహెచ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామమైన నిమ్మాడ మొత్తాన్ని భారీ సంఖ్యలో భద్రతబలగాలు చుట్టుముట్టాయి. ఇంటి ప్రహరీ, ప్రధాన గేటు దూకి మరీ ఏసీబీ సిబ్బంది లోపలికి ప్రవేశించారు. అలా 7.10 గంటలకు అచ్చెన్నాయుడు ఇంట్లోకి వెళ్లిన ఏసీబీ బృందాలు.. 7.20 గంటలకల్లా ఆయన్ను అరెస్టు చేయడం.. పది నిమిషాల్లోనే ఊరు దాటించడం చకచకా జరిగిపోయాయి. అత్యంత నాటకీయంగా ఆరంభమైన ఈ అరెస్టు వ్యవహారం శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో అప్పటి కార్మికశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుణ్ని అరెస్టు చేసినట్లు అనిశా అధికారులు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట