ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆంక్షలు

ఈనెల 16వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్‌ సమావేశాలకు మీడియా పాయింట్‌ వద్ద అన్ని కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Published : 13 Jun 2020 21:55 IST

అమరావతి: ఈనెల 16వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్‌ సమావేశాలకు మీడియా పాయింట్‌ వద్ద అన్ని కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా దృష్ట్యా అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్దకు ఎవరికీ అనుమతి లేదని తెలిపింది. ఉభయ సభల్లోనూ ప్రెస్ గ్యాలరీల వరకు మాత్రమే మీడియా ప్రతినిధులకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులు ప్రవేశించేందుకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని