ఆలోచనలు పంచుకోండి!

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తమ ఆలోచనలు, సమస్యలను పంచుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 28న

Published : 14 Jun 2020 23:55 IST

‘మన్‌కీ బాత్‌’ కోసం ప్రధాని పిలుపు

దిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తమ ఆలోచనలు, సమస్యలను పంచుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 28న ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో చర్చించేందుకు ప్రజల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కొవిడ్‌-19తో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై తాను దృష్టి సారించే అవకాశం లభిస్తుందని మోదీ తెలిపారు. ఓపెన్‌ ఫోరం అయిన..‘ల్వీబ్ని్ర’ షేర్‌ చేసి లేదా టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-11-7800కు ఫోన్‌ చేసి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చన్నారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో సందేశాలను పంపించాలన్నారు. అవన్నీ రికార్డవుతాయని, వాటిలో కొన్నింటిని ప్రసారం చేస్తామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని