పింఛనులో కోత సమంజసం కాదు
రాష్ట్ర ప్రభుత్వానికి ఏ చట్టం ప్రకారం విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత విధించే అధికారం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలో గానీ, చట్టాల్లో గానీ, సుప్రీం కోర్టు తీర్పుల్లో గానీ ఎక్కడైనా ఉందా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఏ చట్టం ప్రకారం విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత విధించే అధికారం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలో గానీ, చట్టాల్లో గానీ, సుప్రీం కోర్టు తీర్పుల్లో గానీ ఎక్కడైనా ఉందా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. విశ్రాంత ఉద్యోగులకు పింఛను కోతకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా స్పష్టమవుతోందని పేర్కొంది. పింఛనులో కోత విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు జోక్యంతో పింఛనులో కోతను 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించామని ధర్మాసనానికి తెలిపారు. అయితే, మిగతా 25 శాతం ఎప్పుడు చెల్లిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని అడిగి చెబుతానని, అందుకు జులై 2 వరకు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు. ఎలాంటి ఇతర ఆధారం లేని విశ్రాంత ఉద్యోగులు పింఛను కోత వల్ల ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు పేర్కొంది. కోత ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగా కనిపించడం లేదని అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కేంద్రం కూడా జీఎస్టీ బకాయిలు చెల్లించడం లేదని ఏజీ తెలిపారు. కేంద్రం తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందా? అని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప పింఛనులో కోత విధించరాదని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాలు, జీవోలు చట్టాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పింఛను కోతను ఏ చట్టం లేదా సుప్రీంకోర్టు తీర్పుతో సమర్థించుకుంటారో ఎల్లుండిలోగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణ బుధవారానికి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?