ఎల్జీ ఘటనలో స్టేకు సుప్రీం నిరాకరణ
విశాఖ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. పెండింగ్ పిటిషన్ల విచారణ వచ్చే వారం చివరకు ముగించాలని హైకోర్టుకు
అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. పెండింగ్ పిటిషన్ల విచారణ వచ్చే వారం చివర్లోగా ముగించాలని హైకోర్టుకు సూచిస్తామని పేర్కొంది. సుమోటోగా కేసు తీసుకునే అధికారం ఉందని ఇప్పటికే ఎన్జీటీ స్పష్టం చేసిందని సుప్రీం వ్యాఖ్యానించింది.
అలాగే ఎన్జీటీ ఆదేశాలతో డిపాజిట్ చేసిన రూ.50 కోట్ల పంపిణీని 10 రోజుల పాటు ఆపాలని మధ్యంతర ఆదేశాన్నిచ్చింది. ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ అప్లికేషన్ సమర్పించాలని పిటిషనర్కు సూచించింది. ఎల్జీ పాలిమర్స్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ... ప్లాంటును సీల్ చేయాలన్న హైకోర్టు ఆదేశాలు సరికావన్నారు. అది రాజ్యాంగ విరుద్ధమని వాదించగా... అలా భావించట్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది