గుడ్‌న్యూస్‌: గచ్చిబౌలి టిమ్స్‌లో 499 ఉద్యోగాలు

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో  ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌ ఆస్పత్రిలో......

Published : 15 Jun 2020 18:10 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో  ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌ ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 499 మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్టు బోర్డు తెలిపింది. ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని