రాష్ట్ర బడ్జెట్కు ఏపీ మంత్రివర్గం ఆమోదం
కరోనా విస్తరణ, ఇతర ప్రత్యేక పరిస్థితుల మధ్య శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమై బడ్జెట్కు ఆమోదముద్ర వేసింది.
అమరావతి: కరోనా విస్తరణ, ఇతర ప్రత్యేక పరిస్థితుల మధ్య శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమై బడ్జెట్కు ఆమోదముద్ర వేసింది. ఎప్పుడూ కనీసం రెండు వారాలపాటు నిర్వహించే బడ్జెట్ సమావేశాలను ఈసారి రెండు రోజుల్లోనే ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఈ ఉదయం జరిగే శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్ నుంచే ఆన్లైన్లో ప్రసంగంచనున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కన్నబాబు సమర్పిస్తారు. శాసనమండలిలో సభా నాయకుడు, ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు. మధ్యాహ్నం 2.45లోగా ఉభయసభల్లోను ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్