లాక్డౌన్ ఉండదు.. అన్లాకే: మోదీ
దేశంలో మరోమారు లాక్డౌన్ ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అన్లాక్-2 ఎలా అమలు చేయాలన్న విషయమై చర్చించాలని అన్నారు. కరోనా ఉద్ధృతి అధికంగా...
హైదరాబాద్: దేశంలో మరోమారు లాక్డౌన్ ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అన్లాక్-2 ఎలా అమలు చేయాలన్న విషయమై చర్చించాలని అన్నారు. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో స్పష్టతనివ్వాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారు. దీనిపై ప్రధాని స్పష్టతనిచ్చారు. దేశంలో లాక్డౌన్ల దశ ముగిసి.. అన్లాక్ల దశ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్లాక్-1 నడుస్తోందన్నారు. అన్లాక్-2 ఎలా అమలు చేయాలన్న విషయమై చర్చించాలని ముఖ్యమంత్రులతో మోదీ అన్నారు. దేశంలో కరోనా కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నందున మరోమారు లాక్డౌన్ విధిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధాని మోదీ స్పష్టతనివ్వడం గమనార్హం.
లాక్డౌన్ సమయంలో ప్రజలు పాటించిన క్రమశిక్షణతోనే దేశంలో కరోనా ఎక్కువగా వ్యాపించకుండా అడ్డుకోగలిగామని ప్రధాని మోదీ అన్నారు. అలానే కరోనా సోకిన కారణంగా సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలు కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత లాక్డౌన్ జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై ప్రధాని ఈ సమావేశంలో చర్చించారు.
‘‘మనం ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతానికి కృషి చేయాలి. అప్పుడే వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి వైద్యం అందించగలం. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అలానే మనం టెస్టుల సంఖ్య కూడా పెంచాలి. అప్పుడే వైరస్ సోకిన వారిని త్వరగా గుర్తించి ఐసోలేషన్కి తరలించి వైద్యం అందించగలం. దేశ వ్యాప్తంగా సుమారు 900 కరోనా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో కరోనా ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ సదుపాయంతో వేల సంఖ్యలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి’’ అని ప్రధాని తెలిపారు.
‘‘కరోనాపై పోరులో భావోద్వేగంతో కూడిన అంశం కూడా ఉంది. వైరస్ సోకుతుందనే అనే భయాలను తొలగించేందుకు ప్రజలకు సహాయం చేయాలి. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతూనే ఉంది. కరోనా సోకిన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు ఒకే చోట ఎక్కువగా గుమిగూడడం, భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడం, రోజులో వేలాది మంది బయట సంచరించడం వంటి కారణాలతో కొన్ని నగరాల్లో కరోనా కట్టడి మరింత సంక్లిష్టంగా మారిందని ప్రధాని అన్నారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో రికవరీ రేటు 52.79 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 10,794 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 3.5 లక్షలకు చేరుకుంది. ఆరో రోజు వరుసగా 10,000 కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 11,903కి చేరింది. దిల్లీ, ముంబయి నగరాల్లోనే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!