INPICS: వీరుడికి కన్నీటి వందనం

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ సమీపంలో భారత్‌-చైనా సరిహద్దు వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఉద్రిక్తతలో వీర మరణం పొందిన సూర్యాపేట వాసి, సైనికుడు కర్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Published : 18 Jun 2020 10:38 IST

సూర్యాపేట: లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ సమీపంలో భారత్‌-చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యాపేట వాసి, కర్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ డి.అర్వింద్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్‌బాబు పార్థివహాన్ని సందర్శించి నివాళులర్పించారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. వేలాది మంది ప్రజలు కర్నల్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. స్థానికులు భవనాలపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. కరోనా వైరస్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పురపాలిక అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సైనిక సంస్కారాల ప్రక్రియలు 16 బిహార్‌ రెజిమెట్‌ బృందం పాల్గొంది.

సంతోష్‌ బాబు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి


కర్నల్‌ పార్థివదేహం వద్ద కుటుంబ సభ్యులు


కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు


 

కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎంపీలు బండి సంజయ్‌, అర్వింద్‌



వందనం చేస్తున్న సైనికులు


వందనం చేస్తున్న కుటుంబ సభ్యులు




కర్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర


కర్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర


జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం తెలుపుతున్న స్థానికులు


అంతిమయాత్ర



అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన స్థానికులు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని