లాక్డౌన్ తర్వాత వస్తా అన్నాడు.. ఇంతలోనే!
అతనికి పెళ్లై ఏడు నెలలే అయ్యింది. లాక్డౌన్ తర్వాత ఇంటికి వస్తానంటూ తన బామ్మతో ఎంతో సంతోషంగా చెప్పాడు. ఇంతలోనే ఊహించని ఉపద్రవం అతన్ని కానరాని లోకాలకు వెళ్లేలా చేసింది. భారత్-చైనా సరిహద్దు వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఉద్రిక్తతలో వీర మరణం పొందిన ఓ సైనికుడి కథ ఇది....
భోపాల్: అతనికి పెళ్లై ఏడు నెలలే అయ్యింది. లాక్డౌన్ తర్వాత ఇంటికి వస్తానంటూ తన బామ్మతో ఎంతో సంతోషంగా చెప్పాడు. ఇంతలోనే ఊహించని ఉపద్రవం అతన్ని కానరాని లోకాలకు తీసుకువెళ్లింది. భారత్-చైనా సరిహద్దు వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఉద్రిక్తతలో వీర మరణం పొందిన ఓ సైనికుడి కథ ఇది. సరిహద్దుల్లో చైనా దళాలతో వీరోచితంగా పోరాడుతూ 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలో మధ్యప్రదేశ్లోని రీవాకు చెందిన దీపక్ కుమార్ సింగ్ వీర మరణం పొందాడు. దీపక్ మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
దీపక్ కుమార్ తల్లి కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి అతను తన బామ్మ పూల్ కుమారి సంరక్షణలో పెరిగాడు. ఈ నేపథ్యంలో దీపక్ కుమార్ మరణ వార్త విన్న పూల్ కుమారి శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. ‘‘నేను కొద్ది రోజుల క్రితం అతనితో ఫోన్లో మాట్లాడాను. లాక్డౌన్ ముగిసిన తర్వాత సెలవు తీసుకొని ఇంటికి వస్తానని చెప్పాడు. అయితే అతని మరణవార్త మాకు తెలిసింది. దీపక్ అందరితో చాలా ప్రేమగా మాట్లాడేవాడు. ఇంట్లో ప్రతి ఒక్కరినీ గౌరవించేవాడు. అందరూ అతన్ని చాలా ఇష్టపడేవారు’’ అంటూ పూల్ కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. దీపక్ కుమార్కు 2019 నవంబర్ 30న వివాహమైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీపక్ భార్య రేఖా సింగ్ మధ్యప్రదేశ్లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్నట్లు చెప్పారు. దీపక్ కుమార్ పార్థివదేహం గురువారం స్వగ్రామానికి చేరుతుందని ఆర్మీ అధికారులు చెప్పినట్లు వారు వివరించారు.
దీపక్ కుమార్ది రైతు కుటుంబం. 2013లో సైన్యంలో చేరాడు. వాళ్ల పెద్ద అన్నయ్య ప్రకాశ్ కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ప్రకాశ్ రాజస్థాన్లో విధులు నిర్వహిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్