అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు శుక్రవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తమ

Updated : 19 Jun 2020 13:32 IST

విజయవాడ: టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు శుక్రవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది కోరగా.. బెయిల్‌ పిటిషన్‌, కస్టడీ పిటిషన్‌పై ఒకేసారి వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

గతంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ఆసమయంలో ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందులు, వైద్య పరికరాల కొనుగోలు, టెలీ మెడిసిన్‌కు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత  అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడ వరకు రోడ్డు మార్గంలో తీసుకురావడంతో 12 గంటల పాటు కారులోనే ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ఆయనకు శస్త్రచికిత్స గాయం పెద్దదికావటంతో అప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని