జవాన్ల త్యాగాలు వృథా కానివ్వం: భదౌరియా
చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా ...
హైదరాబాద్: చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్కు భదౌరియా ముఖ్యఅతిథిగా హాజరై.. వైమానిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలకైనా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
చైనా బలగాల అనూహ్య దాడిలో మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్న భదౌరియా... ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ సేవే ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. మెక్మోహన్ రేఖ వెంట చిన్నపాటి ఘర్షణ తలెత్తినా వెంటనే సహకారమందిస్తామన్నారు. దుండిగల్ అకాడమీలో శిక్షణ పొందిన 123 మందిని నేరుగా క్షేత్రంలోకి దింపుతామన్నారు. ఇతర శిక్షణ కేంద్రాల నుంచి కూడా యువసైనికులను సరిహద్దులోకి తరలిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం మరింత అవసరమన్నారు. ఎలాంటి పరిస్థితులు సంభవించినా ఎదుర్కొనే సత్తా మనకు ఉందన్నారు. సరైన సమయంలో తగిన చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, బలగాలను మోహరించామని వెల్లడించారు. పరిస్థితిపై తమకు సంపూర్ణ అంచనా ఉందని వివరించారు. ఈసందర్భంగా కర్నల్ సంతోష్బాబు బృందానికి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!