కరోనా: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ విజృంభిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 499 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,526కు

Published : 20 Jun 2020 16:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ విజృంభిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 499 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,526కు చేరింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు పీఈసెట్‌ దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకూ పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు ఇవే..!

* ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం సిబ్బంది హాజరుకావాలి. 

* రొటేషన్‌ విధానంలో 50శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలి. 

* విడిగా చాంబర్లు ఉన్నవారు రోజూ రావాల్సిందే.

* డ్యూటీ లేని ఉద్యోగులు హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లొద్దు. 

* గర్భిణీలు, ఇతర వ్యాధులతో బాధపడేవారు సెలవులను ఉపయోగించుకోవాలి.

* అధికారుల డ్రైవర్లు పార్కింగ్‌లో కాకుండా పేషీలో ఉండాలి. 

* ఉన్నతాధికారుల అనుమతి లేనిదే సందర్శకులను కార్యాలయాల్లోకి అనుమతించకూడదు. 

* బీఆర్‌కే భవన్‌లో నాలుగో తరగతి ఉద్యోగులకు వారం విడిచి వారం విధులు.

* ఈనెల 22 నుంచి జులై 4వ తేదీ వరకూ ఆదేశాలు అమల్లో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని