తెలంగాణలో కొత్తగా 730 కరోనా కేసులు

వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల

Published : 22 Jun 2020 02:34 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 730 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 659, ఇతర జిల్లాల్లో 71 కేసులు వచ్చినట్లు పేర్కొంది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 7,802కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 210 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి కోలుకుని 3,731 మంది డిశ్చార్జి కాగా.. 3,861 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ 3,297 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు 57,054 నమూనాలను పరీక్షించగా.. 49,252 నెగిటివ్‌ వచ్చాయని వెల్లడించింది.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని