57 బాలికలకు కరోనా.. ఐదుగురు గర్భిణులు
ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్ ప్రభుత్వ బాలికల ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలకు కరోనా వైరస్ సోకింది. వీరిలో ఐదుగురు గర్భవతులు కావడం, మరొకరికి హెచ్ఐవీ ఉన్నట్టు తెలియడం సంచలనం సృష్టించింది. ఈ విషయం నిజమేనని ధ్రువీకరించడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.
కాన్పూర్: ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ ప్రభుత్వ బాలికల ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలకు కరోనా సోకింది. వీరిలో ఐదుగురు గర్భవతులు. ఒకరు హెచ్ఐవీ బాధితురాలు. ఈ సమాచారం నిజమేనని అధికారులు ధ్రువీకరించడంతో స్థానికంగా కలవరం మొదలైంది.
ప్రస్తుతం ఈ ఆశ్రయ గృహాన్ని మూసేసిన ప్రభుత్వం సంబంధిత సిబ్బందిని క్వారంటైన్కు తరలించింది. ఈ గృహంలో ఏడుగురు గర్భిణులు ఉన్నారని అందులో ఐదుగురికి కొవిడ్-19 పాజిటివ్ అని కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ బ్రహ్మదేవ్ రామ్ తివారీ ఆదివారం సాయంత్రం మీడియాతో వెల్లడించారు. ఆశ్రయం పొందక ముందునుంచే ఈ బాలికలు గర్భవతులని ఆయన స్పష్టం చేశారు. పోక్సో చట్టం కింద దర్యాప్తు చేపట్టామని వివరించారు. జిల్లా ఎస్పీ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ గృహంలోకి పురుషులు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
ఆశ్రయ గృహంలోని బాలికలు కొన్ని రోజుల ముందు నుంచి కొవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని స్థానిక అధికారులు వైద్యశాఖకు తెలియజేశారు. పరీక్షలు నిర్వహించడంతో వైరస్ సోకిందని తేలింది. గర్భిణుల్లో ముగ్గురిని రామ వైద్య కళాశాల, ఇద్దరిని హలెట్ ఆస్పత్రిలో చేర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్