ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉదయం 10 వరకు కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44 మంది. ఇతర దేశాలకు చెందినవారు ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలో
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉదయం 10 వరకు కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44 మంది. ఇతర దేశాలకు చెందినవారు ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,372గా ఉండగా...
అందులో రాష్ట్రానికి చెందిన కేసులు 7,451. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి 1,584కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 337 మంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,826 మంది చికిత్స పొందుతుండగా.. 4,435 మంది నయమై డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు 111 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో 16,704 కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.