IN PICS: కర్నల్‌ కుటుంబంతో కేసీఆర్‌

వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబసభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. గతంలో ప్రకటించిన విధంగా సంతోష్‌బాబు సతీమణికి ఆర్డీవో నియామక పత్రాలు

Published : 22 Jun 2020 17:32 IST

సూర్యాపేట: వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబసభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. గతంలో ప్రకటించిన విధంగా సంతోష్‌బాబు సతీమణికి ఆర్డీవో నియామక పత్రాలు అందజేశారు. దీంతోపాటు రూ.ఐదు కోట్ల చెక్కు, నివాస స్థల పత్రాలను కూడా అందజేశారు. అంతకుముందు కర్నల్‌ సంతోష్‌బాబు చిత్రపటానికి సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇటీవల భారత్‌ - చైనా సరిహద్దు వద్ద గల్వాన్‌ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. 


కర్నల్‌ సంతోష్‌బాబు చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న సీఎం కేసీఆర్‌


 సంతోష్‌బాబు సతీమణి సంతోషీతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌


ఆర్డీవో నియామక పత్రాలను అందజేస్తున్న సీఎం కేసీఆర్‌


మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు, అధికారులు


సంతోష్‌ బాబు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న సీఎం కేసీఆర్


సంతోష్‌బాబు కుటుంబసభ్యులతో కేసీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని