సూర్యాపేటలో సంతోష్‌బాబు కాంస్య విగ్రహం

వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబసభ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా 

Updated : 22 Jun 2020 19:31 IST

మంత్రి జగదీశ్‌ రెడ్డి వెల్లడి

సూర్యాపేట: వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబసభ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. సంతోష్‌ బాబు కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘సంతోష్ బాబు కుటుంబ సభ్యుల కోరిక మేరకు హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇచ్చాం. సూర్యాపేటలో సంతోష్‌ బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. విగ్రహం ఏర్పాటు చేశాక ఆ ప్రాంతానికి సంతోష్‌ బాబు కూడలిగా నామకరణం చేస్తాం’’ అని జగదీశ్‌ రెడ్డి చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని