మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్‌

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తెలిపారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు రూ.10కోట్లు

Updated : 27 Jun 2020 20:02 IST

హైదరాబాద్‌: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తెలిపారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు రూ.10కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28న పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో వీక్షకులకు అనుమతినిస్తామన్నారు. 

‘‘పీవీ జయంతి వేడుకలను 50 దేశాల్లో నిర్వహిస్తాం. పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా అందిస్తాను. పార్లమెంట్‌లో పీవీ చిత్రపటం నెలకొల్పాలి. హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ ఏర్పాటుకు కేకే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగరతోపాటు దిల్లీలోని తెలంగాణ భవన్‌లోనూ పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. అలాగే శాసనసభలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని